కీర్తి సురేష్ కి మహానటి సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఆమె మన తెలుగులో సినిమాలు పెద్దగా చేయకపోయినా సరే ఆమెకు అవకాశం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆమె కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు కూడా. ఇక ఇప్పుడు మన తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఈ సినిమాల తర్వాత ఆమె మరో స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. 

 

అయితే అది ఖరారు కాకపోయినా సరే ఆమె కోసం మాత్రం ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశం వచ్చింది అని సమాచారం. బాలీవుడ్ లో ఆమెతో ఒక సినిమా సోలో గా చెయ్యాలని దర్శకుడు ఒకరు భావిస్తున్నారు అని సమాచారం. ఆమెకు ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా చెప్పారు అని టాలీవుడ్ లో టాక్. ఆ సినిమా నిర్మాత అనుష్క శర్మ అని సమాచారం. ఆమెకు ఇప్పటికే అనుష్క కూడా ఫోన్ చేసి కథ వినిపించింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమె తమిళంలో బిజీ గా ఉంది. అక్కడి సినిమాల తర్వాత మాత్రమే ఆమె తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఇక్కడ ఎన్ని సినిమాలు చేస్తుందో గాని బాలీవుడ్ లో మలయాళం లో మాత్ర౦ ఆమెకు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకే ఆమె అక్కడి మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని వ్యవహరిస్తుంది. ఇక తెలుగులో కూడా ఆమె విజయ నిర్మల బయోపిక్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: