నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన లేటెస్ట్ సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయున్స్ గా నటించారు. అయితే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సరిగ్గా రిలీజ్ కాబోతుంది అనుకున్న సమయంలో కరోనా కాటేసింది. దాంతో ఈ సినిమా వాయిదా పడింది. అయితే త్వరలో సినిమా షూటింగ్స్ తో పాటు థియోటర్స్ ని ఓపెన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా థియోటర్స్ లోకి వచ్చేది ఈ సినిమానే అని తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత నాని టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ సమంత - నాగ చైతన్య తో మజిలీ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా.. శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించే సినిమాలు చేయనున్నాడు. అలాగే టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించే 'శ్యామ్ సింగరాయ్' సినిమాలోను నటిస్తాడు. 

 

అయితే నాని ఇప్పుడు ఒక అద్భుతమైన సినిమాని వదులుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. అదే రీసెంట్ గా మోషన్ పోస్టర్ రిలీజైన ప్రశాంత్ వర్మ సినిమా. ఈ సినిమాని " అ " తరహాలోనే నాని ప్రశాంత్ వర్మ కలిసి చేయాలనుకున్నారని అయితే కొన్ని క్రియోడివ్ డిఫ్రెన్సెస్ వల్ల అది వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో నటించకపోయినా నిర్మతగా అయినా నాని చేసి ఉండాల్సింది అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట.

 

ఇక ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కరోనా ని బేస్ చేసుకొని ఈ యంగ్ డైరెక్టర్ మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. కరోనా వైరస్ వలన ఏర్పడిన  పరిస్థితులు, భయానక సంఘటనలతో పాటు, దానికి పరిష్కారం.. వాక్సిన్ కనుగొనడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: