నాగ్ అశ్విన్ డైరక్షన్ లో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా మహానటి. మహానటి సావిత్రి జీవిత కథతో వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు అందరు ఫిదా అయ్యారు. సినిమా కమర్షియల్ హిట్ అవడమే కాకుండా మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ష్ బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే బాలీవుడ్ అందాల భామ దీపికా పడుకునే మహానటి సినిమా చూసిందట. చూడటమే కాదు ఆమెకు సినిమా బాగా నచ్చడంతో వెంటనే మహానటి సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటె చూడండంటూ మెసేజ్ పెట్టింది. 

 

అంతేకాదు మహానటి పోస్టర్ కూడా షేర్ చేసింది. ఇది చూసిన డైరక్టర్ నాగ్ అశ్విన్ తెల్లవారుఝామునే ఒక కూల్ నోటిఫికేషన్ తో నిద్ర లేచా అంటూ కామెంట్ పెట్టాడు. 2018లో రిలీజైన మాహానాటి సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. సావిత్రి బయోపిక్ కదా అందులో ఏముంటుందిలే అనుకునున్న వాళ్లందరికీ సినిమా షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కీర్తి సురేష్సినిమా కోసం ప్రాణం పెట్టేసింది తెలుస్తుంది. తెలుగు ఆడియెన్స్ ను మాత్రమే కాదు తమిళ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 

 

ఇక ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీస్ ను సైతం ఫిదా అయ్యేలా చేస్తుంది. తనకు నచ్చిన సినిమా గురించి ప్రస్తావించి వెంటనే సినిమా చూడని వీలు ఎవరైనా ఉంటె చూడండని చెప్పిన దీపికా పదుకొనేని కూడా ఈ సందర్భంలో మెచ్చుకుంటున్నారు. మొత్తానికి మహానటి సినిమా దీపికాను సంబ్రమాశ్చర్యానికి గురి చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ బాహుబలి ప్రభాస్ తో మరో సంచలన సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుందని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: