మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజునాడు బాలకృష్ణ ఆవేశంగా ఇండస్ట్రీ పెద్దలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ తో మళ్ళీ ఇండస్ట్రీలోని ఇగోలు బయటపడ్డాయి అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు బాలకృష్ణ ఆవేశంతో అన్న భూముల వ్యవహారంలో బాలయ్య ఎవరిని టార్గెట్ చేస్తూ అన్నాడు లేదంటే ఎదో ఒక ఫ్లోలో అన్నాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇది ఇలా ఉండగా నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తూ కొన్ని పరుష కామెంట్స్ చేసినా ఈ విషయాలను బాలయ్య వీరాభిమానులు పెద్దగా పట్టించుకోకపోవడం పరిశీలించిన వారు బాలయ్య ఆవేశాన్ని అతడి అభిమానులు కూడ లైట్ గా తీసుకున్నారా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ బాలయ్యతో సినిమాను తీస్తున్న బోయపాటి శ్రీను కు టార్చర్ గా మారినట్లు టాక్.


ఇప్పటికే వరస పరాజయాలతో బాలయ్య మార్కెట్ పూర్తిగా పడిపోయిన పరిస్థితులలో బోయపాటి ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడం ఒక సాహసం అయితే ఆ సినిమాను ఖచ్చితంగా హిట్ చేయాలి అన్న ఒత్తిడి బోయపాటి పై విపరీతంగా పెరిగిపోతోంది. దీనికితోడు ప్రస్తుతం బోయపాటి క్రేజ్ కూడ అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో ఈ సినిమా హిట్ కావడం బాలయ్యకంటే బోయపాటికే ఎక్కువ అవసరం.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో అఘోరా గా కొన్ని సీన్స్ లో నటిస్తున్న బాలయ్య కోసం రెండు మేకప్ స్కెచ్ లు బోయపాటి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సీన్స్ అన్నీ వారణాసిలో చిత్రీకరించ వలసి ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సమస్యలు వల్ల ఇప్పట్లో వారణాసి వెళ్ళే అవకాసం లేదు కాబట్టి వారణాసిని పోలిన ఒక సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసి తిరిగి షూటింగ్ లు మొదలైన వెంటనే ఈ మూవీని పరుగులు తీయించి తిరిగి బాలకృష్ణకు పూర్వ వైభవం తీసుకు రావడానికి ఈ లాక్ డౌన్ పిరియడ్ లో బోయపాటిమూవీ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: