వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో ఎవరికి అర్ధం కాని విషయం. తన మనసులో ఏదైనా అనుకుంటే ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మొహమాటంగా చెప్పడం వర్మకు అలవాటు. ఈ మధ్య లాక్‌ డౌన్ సమయంలో ఇళ్ళకే పరిమితమైన హీరోలు దర్శకుల పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటెర్లు వేస్తున్న విషయం తెలిసిందే. అందరు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్ళకే పరిమితమైతే రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనా వంటి  క్లిష్ట సమయంలో కూడా ‘క్లైమాక్స్’ సినిమాతో పాటు ‘కరోనా’ పేరుతో సినిమాలను తీసి అందరికి షాక్ ఇచ్చాడు.  


లేటెస్ట్ గా  క్లైమాక్స్ ట్రైలర్‌ను విడుదలచేసి అందరికి షాక్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా ట్రైలర్‌ను  చూసి  అమితాబ్ బచ్చన్ కూడ మెచ్చుకున్నవిషయాన్ని అందరికి తెలియచేసాడు.ఈ సందర్భంగా ఒక నెటిజన్ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ ‘మీరు ఇంట్లో ఉండి ఏ పనులు చేయరు. గిన్నెలు తోమరు. బట్టలు ఉతకరు’  అంటూ ఆట పట్టించాడు దీనికి వర్మ తనదైన శైలిలో సమాధానమిస్తూ లాక్‌డౌన్ సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలు ఇంట్లో ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్‌లో భాగంగా ఇంట్లో పనులు చేసిన విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ  వారంతా  బిజీగా ఉంటే  తాను మాత్రం ఖాళీగా ఉండకుండా ఏకంగా రెండు సినిమాలు తీశాను అంటూ తన గొప్పలు తానె చెప్పుకున్నాడు.  


దీనితో  వర్మ ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా షూటింగ్ ఎలా చేసాడా అన్న విషయం అర్ధంకాక రాజమౌళి లాంటి దర్శకులు కుడా ఆశ్చర్య పోతున్నట్లు టాక్.  ప్రభుత్వాలు షూటింగ్ లను నిషేధించిన పరిస్థితులలో వర్మ తాను సినిమాలు షూట్ చేసాను అని ఓపెన్ గా చెపుతూ ఉండటంతో రాజమౌళి కొరటాల శివ లాంటి దర్శకులకు ఒకరకం రూల్స్ రామ్ గోపాల్ వర్మకు ఒక రకం రూల్స్ ఉంటాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్న పరిస్థితులలో రాజమౌళి లాంటి దర్శకులు కూడ వర్మ సీక్రెట్ తెలియక తల పట్టుకుంటునట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: