బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సాహో సినిమాతో ఉత్తరాదిన తన బలమేంటో చూపించాడు. సాహో సినిమాకి దక్షిణాదిన అంతగా ఆదరణ లభించకపోయినా ఉత్తరాదిన వసూళ్ళ వర్షం కురిపించింది. దాంతో అక్కడ ప్రభాస్ స్టామినా ఏంటనేది అర్థం అయిపోయింది. అయితే ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇంకా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

 

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషనులో సినిమా అనుకున్నప్పటి నుండి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ సినిమా కథపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు బయటకి వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రం టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో సాగుతుందని వార్తలు పుట్టిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ ఓ దేవకన్య బిడ్డగా కనిపించబోతున్నాడని, ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా పడుకునే కనిపించనుందని జోరుగా వార్తలు రాసేశారు.

 


ప్రస్తుతం ఆ వార్తలు నిజమయ్యే సూచన కనిపిస్తుంది. నిన్నటికి నిన్న దీపికా పదుకునే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్తకి సంబంధించి హింట్ ఒకటి బయటకి వచ్చింది. దీపికా పదుకునే తన ఇన్స్టా అకౌంట్ స్టోరీలో మహానటి సినిమా పోస్టర్ ని పెట్టి, ఈ సినిమాని ఇప్పుడే చూడండని మెసేజ్ పెట్టింది. అలాగే నాగ్ అశ్విన్ పేరుని యాడ్ చేసింది. దాంతో వీరిద్దరి మధ్య ప్రభాస్ సినిమాకి సంబంధించి చర్చలు జరిగాయని అనుకుంటున్నారు.

 

మరికొద్దిరోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతుందని వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా క్యాస్టింగ్ విషయమై సినిమా దర్శకులు అంత త్వరగా బయటకి చెప్పరు. అనేక కారణాల వల్ల అన్నీ కన్ఫర్మ్ అయ్యాకే బయటకి వెల్లడించడానికి ఇష్టపడతారు. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుందని అనుకుంటున్నారు. చూడాలి మరి నాగ్ అశ్విన్ ఎప్పుడు బయటకి రివీల్ చేస్తాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: