కెజిఎఫ్ సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఆ సినిమా సీక్వల్ కెజిఎఫ్ చాప్టర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ మూవీని రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిని ఎక్సయిట్ అయ్యేలా చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని అంటున్నారు. కెజిఎఫ్ 2 రిలీజ్ అవడమే ఆలస్యం ఈ సినిమా పట్టాలెక్కబోతుందని టాక్. 

 

ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న తారక్ ఆ తర్వాత సినిమా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ పిరియాడికల్ మూవీ ప్లాన్ చేశాడని తెలుస్తుంది. సినిమా ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా స్క్రిప్ట్ రాస్తున్నాడట. కెజిఎఫ్ 2 కూడా అనుకున్న రేంజ్ హిట్ కొడితే మాత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై అందరి ఫోకస్ ఏర్పడుతుంది. 

 

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే తారక్ ప్రశాంత్ నీల్ చెప్పిన పిరియాడికల్ స్టోరీకి ఫిదా అయినట్టు తెలుస్తుంది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ కాంబో సినిమా వస్తే మాత్రం బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు.  ట్రిపుల్ ఆర్ తో ఎలాగూ సంచలన రికార్డులు తన పేరు మీద రాసుకునేందుకు ఎన్టీఆర్ సిద్ధమవగా ప్రశాంత్ నీల్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీసి నేషనల్ వైడ్ గా తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. మరి రాబోయే ఈ సినిమాలు నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకోవాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: