మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ సినిమాను రంగం సిద్ధం చేయబోతున్నారు. రేపు అనగా మే 31వ తారీఖున మహేష్ తన తర్వాత సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సర్కార్ వారి పాట అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఈ సినిమా కథ ఇదే అంటూ కొంతమంది నెట్లో పెట్టి హల్చల్ చేస్తున్నారు.

IHG

ఇకపోతే ఈ విషయం పై సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు భారతదేశ బ్యాంకులకు కోట్లాది రూపాయలు మోసం చేసి నగదు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన కొందరి నుండి మహేష్ బాబు డబ్బులు ఎలా రాబట్టాడు అనే కాన్సెప్ట్ పై ఈ సినిమాను ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాదు రాబోయే సినిమాల్లో మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండబోతుందట. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించబోతున్నారు. విజయ్ దేవరకొండ తో చేసిన గీత గోవిందం సినిమా తర్వాత మళ్లీ పరశురాం డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.

IHG

అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ నటించబోతోందని వార్తలు వినపడుతున్నాయి. ఇది ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే ఈ చిత్రానికి విజువల్స్ ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి. సి. శ్రీరామ్ అందించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మాత్రం ఇంకా ఊహించలేదు. ఇక తాజాగా ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: