సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం పరశురామ్ డైరక్షన్ లో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. మే 31న ఈ సినిమా ముహూర్తం ఉంటుందని టాక్. ఇదిలాఉంటే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ కూడా లీక్ అయ్యింది. సినిమాకు సర్కార్ వారి పాట అని టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే దాదాపు ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేస్తారని టాక్. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా ఫిక్స్ అయ్యింది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి చేసేలోగా మధ్యలో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు మహేష్. అందుకే శేఖర్ కమ్ములతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. 

 

అసలైతే ఫిదా సినిమా కథను మహేష్ కు వినిపించగా ఇందులో హీరో పాత్ర కన్నా హీరోయిన్ రోల్ కొద్దిగా డామినేట్ చేస్తుందని ఆ సినిమా వదులుకున్నాడు. అయితే ఆ సినిమాతోనే వరుణ్ తేజ్ కెరియర్ లో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాను మహేష్ తో చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో మరో స్పెషల్ సర్ ప్రయిజ్ ఏంటంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సినిమాలో నటిస్తాడని టాక్. 

 

అంటే ఓ పక్క సూపర్ స్టార్ మరో పక్క రౌడీ హీరో.. ఈసారి శేఖర్ కమ్ముల పెద్ద స్కెచ్ వేసినట్టు ఉన్నాడని అంటున్నారు. అన్ని కుదిరితే మహేష్, విజయ్ మల్టీస్టారర్ సెట్ అయ్యే అవకాశం ఉంది. విజయ్ కూడా మహేష్ తో చేసేందుకు సిద్ధమని తెలుస్తుంది. మరి ఈ క్రేజీ మల్టీస్టారర్ కు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.                                

మరింత సమాచారం తెలుసుకోండి: