బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే తెలుగు ప్రజలందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇటీవల కాలంలో తాను తెలుగు సినిమాలను గురించి ప్రస్తావించి ప్రశంసించిన దాఖలాలు లేవు. తాజాగా ఆమె సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి తన సోషల్ మీడియాలో మాట్లాడింది. కీర్తి సురేష్ మహానటి సినిమాలో చాలా అద్భుతంగా నటించిందని ఆమె తెగ కొనియాడింది. కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని ఆమె తన అభిమానులకు సూచించింది. తన సోషల్ మీడియా ఖాతాలో మహానటి సినిమా పోస్టర్ ఫోటో పెట్టి వాచ్ ఎట్ నౌ అని కామెంట్ చేయగా... చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్... లేవగానే ఎంత మంచి విషయం తెలుసుకున్నాను అని దీపికా ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు. 


ఇకపోతే ప్రభాస్ నటించబోతున్న సైంటిఫిక్ ఫిక్షన్ త్రిల్లర్ మూవీ లో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధం కథాంశంతో ప్రభాస్ సినిమా తెరకెక్కబోతున్నట్టు అనేకమైన రూమర్లు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. మరి నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 


బాహుబలి సినిమా తర్వాత అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రభాస్ ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమే. అతను మళ్ళీ మంచి సినిమాతో రావాలని ఎంత మంది ప్రేక్షకులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు. కొన్ని రోజుల పాటు తాను విదేశీ యాత్ర లో ఎంజాయ్ చేయగా... గత రెండు నెలలుగా కరోనా దెబ్బకు షూటింగులు అన్ని నిలిపివేయబడినవి. దీంతో అతని నెక్స్ట్ సినిమా యొక్క షూటింగ్ ఇంకా పూర్తి అవలేదు. ఇప్పుడిప్పుడే చిత్రీకరణలకు అనుమతి నిస్తున్నాయి ప్రభుత్వాలు. అన్నీ సానుకూలంగా జరిగితే ప్రభాస్ తదుపరి సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: