ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఆటగాళ్లు అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ అయితే... ప్రస్తుతం లాక్ డౌన్ సమయం లో సోషల్ మీడియా హీరోగా మారిపోయాడు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఆకర్షిస్తూ సూపర్ హీరో అయిపోతున్నాడు డేవిడ్ వార్నర్. మొన్నటి వరకు క్రికెట్లో దిగ్గజ ఆటగాడి గా పేరు తెచ్చుకుని హీరోగా మారిన వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో  తనలోని మరో టాలెంట్ ను కూడా నిరూపిస్తూ సోషల్ మీడియా స్టార్ గా మారిపోతున్నాడు. 

 


 అయితే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గర అవుతున్నాడు.ఎందుకంటే తెలుగు  సినిమాల నుండి కొన్ని పాటలు తీసుకుని దానిపై కుటుంబ సమేతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ అదరగొడుతున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే తాజాగా అభిమానుల కోరిక మేరకు మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మైండ్ బ్లాక్ అనే పాటకి తన భార్యతో కలిసి స్టెప్పులు వేసి అద్దరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్  గా మారిపోయింది. 

 


 అయితే తాజాగా దీనిపై సరిలేరు నీకెవ్వరు సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఈ ఏడాది  ఐపీఎల్ లేకపోయినప్పటికీ డేవిడ్ వార్నర్ మాత్రం అందరికీ ఎంతో వినోదాన్ని పంచుతున్నాడు  అంటూ అనిల్ రావిపూడి తెలిపారు... ప్రస్తుతం ఐపీఎల్ కాస్త వార్నర్ టిక్ టాక్ ప్రీమియర్ లీగ్ గా మారిపోయింది అంటూ తనదైన శైలిలో వార్నర్ డాన్స్ పర్ఫార్మెన్స్ లపై కామెంట్ చేశాడు అనిల్ రావిపూడి. అంతేకాకుండా వార్నర్ సతీమణి క్యాండీస్ డాన్స్ కు కూడా తాను ముగ్దున్ని  అయినట్లు వెల్లడించారు. డేవిడ్ వార్నర్ తర్వాతి  వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: