ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి సరసన నయనతార, సమంత హీరోయిన్ల గా తమిళంలో ఒక సినిమా తీసేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు విగ్నేష్ శివం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. ఈ సినిమా మొత్తం ముక్కోణపు ప్రేమకథగా వినోద భరితంగా  ప్రధానంగా తెరకెక్కించబోతున్న. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మే నెలలోనే మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ ని వాయిదా వేశారు.


ఇక అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లకు అనుమతి వచ్చే అవకాశాలు ఉండడంతో ఆగస్టు నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నయనతార ప్రియుడు అయిన విగ్నేష్ శివం డైరెక్టర్ గా వహిస్తుండడం గమనార్హం. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిచబోతున్నాడు. ఈ సినిమా ని సెవెంత్ గ్రీన్ స్టూడియో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై లలిత కుమార్ నిర్మాతగా వహిస్తున్నారు. ఇది అంతా ఇలా ఉండగా మరోవైపు నయనతార, సమంత, విజయ్ కలిసి నటించడం ఇదే మొదటి సారి అని చెప్పాలి.


ఇక మల్టీస్టారర్ హీరోయిన్ గా నయనతార, సమంత కలిసి నటించడం కూడా ఇది మొదటిసారి అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు సార్లు ఒకే సినిమాలో నటించి ఉండడంతో ప్రేక్షకులల్లో  భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా నయనతార, త్రిష ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ చివరకి త్రిష స్థానంలో సమంతని ఎన్నుకొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ ని కూడా ఫిబ్రవరిలో విడుదల చేశారు. అప్పట్లోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ టీజర్.

మరింత సమాచారం తెలుసుకోండి: