‘సాహో’ వంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ అదేవిధంగా గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్  లాక్ డౌన్ ముందు వరకు చాలా చాలా వేగంగా సాగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లు లాక్ డౌన్ వల్ల బంద్ అయిపోయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

IHG

ఇదిలా ఉండగా లాక్ డౌన్ టైములో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా ఓకే చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో తాజాగా వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల నాగ్ అశ్విన్ సినిమాకి సంబంధించిన స్టోరీ దీపికాపదుకునే కి వినిపించాడట. హీరోయిన్ క్యారెక్టర్ అదిరిపోవడంతో పైగా ప్రభాస్ పక్కన ఛాన్స్ రావడంతో దీపికా పదుకొనే కొంచెం టైం అడిగిందట.

IHG's ...

ఇదే సమయంలో నాగ్ అశ్విన్సినిమా డైరెక్ట్ చేశారో తెలుసుకుని 'మహానటి' సినిమా చూసి ఫుల్ ఫిదా అయిపోయిందట దీపిక. దీంతో నెక్స్ట్ రోజు సోషల్ మీడియాలో మహానటి సినిమాని అందరు చూడండి అని కామెంట్ పెట్టింది. దీనికి  నాగ్ అశ్విన్ తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అని రాసాడు. దీంతో ప్రభాస్ సినిమా కి దీపికా పదుకొనే ఓకే అయిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: