మహేష్ బాబు సినిమాలు అనగానే మన తెలుగులో జనాలకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ ఉండేది. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే పనులు మానుకుని మరీ ఎదురు చూసే పరిస్థితి ఉండేది అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో దాదాపు గా హిట్ అవుతున్నాయి. ఆయన హీరో గా వచ్చిన సినిమాలు మార్కెట్ ని కూడా భారీగా పెంచుకుంటున్నాయి అనే సంగతి తెలిసిందే. శ్రీమంతుడు సినిమా దగ్గరి నుంచి ఆయన సినిమాలకు మంచి ఆదరణ అనేది వస్తుంది. 

 

ఇక అక్కడి నుంచి కూడా మహేష్ సినిమాలను కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాత్రం ఆయన క్రేజ్ కాస్త తగ్గింది అని అంటున్నారు. అయితే మహేష్ బాబు  మాత్రం సినిమాల విషయంలో కాస్త దూకుడుగానే వెళ్తున్నారు ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. 

 

ఇక ఇది పక్కన పెడితే మహేష్ బాబు సినిమాలను కొనడానికి గానూ బాలీవుడ్ లో నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని సమాచారం. ఆయన సినిమా హక్కుల కోసం అటు తమిళంలో కూడా ఇప్పుడు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో అక్కడ విడుదల చేయడానికి గానూ ఆయన సినిమాలను కొనే ప్రయత్నాలను వాళ్ళు చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. పరుశురాం తో చేసే సినిమాను కొనడానికి కొందరు ముందుకు వచ్చారు. అదే విధంగా రాజమౌళి తో మహేష్ బాబు చేసే సినిమాకు సంబంధించి ఇప్పటి నుంచే మార్కెట్ జరుగుతుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: