సూపర్ స్టా మహేష్ బాబు తండ్రిగారైన క్రిష్ణగారి జన్మదిన్నాని పురస్కరించుకుని మహేష్ తర్వాతి చిత్ర ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎవరి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే విషయంలో అనేక కథనాలు వచ్చాయి. కానీ ఎట్టకేలకి మహేష్ సినిమాకి సంబంధించి అప్డేట్ బయటకి వచ్చేసింది. గీత గోవిందం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే టైటిల్ తో మహేష్ 27వ చిత్రం తెరకెక్కనుంది.

 


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ ని చూస్తుంటే మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ ముఖం కనిపించకుండా చేసినప్పటికీ సైడ్ వ్యూ లో నుండి మహేష్ హెయిర్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. అంతేకాదు చెవికి రింగు అల్ట్రా స్టైలిష్ గా కనిపించింది. మరీ ముఖ్యంగా అందరినీ ఆకర్షించిందీ, ఆసక్తి కలిగించేలా చేసిందీ ఒకే ఒక్కటి. అదే మెడ మీద రూపాయి నాణెం టాటూ..

 

ఈ టాటూని చూస్తుంటే మహేష్ ఏదో విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. దేశానికి సంబంధించిన సామాజిక సందేశం ఈ సినిమాలో ఉండనుందని అర్థం అవుతుంది. గతంలో ఈ సినిమాపై అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. కోట్లకి కోట్లు బ్యాంకులకి రుణాలని ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయే వారి గురించిన కథ అయ్యుంటుందని రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం అది నిజమేనని అనిపిస్తుంది.

 

సినిమా టైటిల్ తో పాటు, మెడ మీద రూపాయి టాటూని చూస్తుంటే ఇంతకుముందు వచ్చిన రూమర్లు నిజమే కావొచ్చని భావిస్తున్నారు. అయితే సినిమాజోనర్ లో తెరకెక్కనుందనే విషయం ఇంకా తెలియదు. కానీ టైటిల్ ని బట్టి మాస్ అంశాలతో కూడిన సామాజిక సందేశాత్మక చిత్రం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదీగాక పరశురామ్ మాస్ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: