మహానటితో సౌత్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ  కీర్తి సురేష్. ఈసినిమా తరువాత  భారీ ఆఫర్లు వచ్చిన వాటిని వదులుకొని కేవలం లేడీ ఓరియెంటెడ్  సినిమాలకు మాత్రేమే జై కొట్టింది. అందులో భాగంగా కీర్తి వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమూడు సినిమాల షూటింగ్ కూడా పూర్తయింది. అందులో మొదటిది పెంగ్విన్. తమిళం లో తెరకెక్కిన ఈ చిత్రం  థియేటర్ రిలీజ్ లేకుండానే  డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుంది. ఇటీవలే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను  అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జూన్ 19న  డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలకానుందని ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించాడు. 
 
ఇక ఈసినిమా మాత్రమే కాదు కీర్తి నటిస్తున్న మిగతా రెండు లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్నాయట. ఈరెండు కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలే. మహానటి తరువాత కీర్తి, తెలుగులో మిస్ వరల్డ్, గుడ్ లక్ సఖి సినిమాలకు సైన్ చేసింది అందులో మిస్ వరల్డ్  ఏప్రిల్ లో విడుదలకావాల్సి వుంది కానీ కరోనా వల్ల  వాయిదా పడింది అయితే మంచి డీల్ కుదిరితే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి నిర్మాత రెడీ గా వున్నాడట. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నాడు. 
 
ఇక ఇక్బాల్ ఫేమ్ నగేష్ కుకునూరు డైరెక్షన్లో తెరకెక్కుతున్న గుడ్ లక్ సఖి కూడా డైరెక్ట్ గా ఓటిటి లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి ,షూటర్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: