కరోనా పై పోరాటం చేసే విషయంలో ఎవరికి వారుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు తమ సేవా కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు అని చెప్పాలి. ప్రతీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక మన తెలుగులో అయినా బాలీవుడ్ లో అయినా సరే కరోనా పోరాటం విషయంలో కొందరు హీరోలు మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే వ్యక్తి చిరంజీవి. ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా కొన్ని వీడియో లను సోషల్ మీడియా లో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. మాస్క్ లు గురించి ఆయన ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. 

 

ఈ వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అని చెప్పవచ్చు. ఆయన కుటుంబం కూడా ఈ విషయంలో ముందుకు అడుగు వేస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా ఆదర్శంగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. సినీ కార్మికులకు ఆయన తన వంతుగా సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసే సినిమా మీద స్పష్టత రావడం లేదు. 

 

ప్రస్తుతం ఆయన  సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. లాక్ డౌన్ కారణంగా చిరంజీవి ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే చెప్పాడం కాస్త కష్టమే. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి వచ్చే ఏడాది కాస్త సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: