మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారని సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఆచార్య అని చిరంజీవిసినిమా ఫంక్షన్ లో చెప్పేశారన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడట. ఇప్పటివరకు వాళ్ళిద్దరూ కలిసే కొన్ని సినిమాల్లో నటించారు కానీ ఏ ఒక్కరి పాత్రలు ఎక్కువ సేపు లేవు. కానీ ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర చాలా సేపు ఉంటుందని ఆచార్య సినీ బృందం తెలిపింది. ఈ సినిమా గురించి అడపాదడపా అనేకమైన వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 


రామ్ చరణ్ పాత్ర కు ఎక్కువ సమయం ఉండటంతో అతని సరసన ఓ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు సినీ బృందం తెలపగా... ఇన్ని రోజులు సరైన ముద్దు గుమ్మ కోసం వెతికారు. అయితే తాజాగా రష్మికా మందాన చెర్రీ పక్కన నటిస్తే బాగుంటుందని సినీ బృందం భావించి ఆమెను సంప్రదించారట. అయితే రష్మిక మందాన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించేందుకు అంగీకరించిందని సమాచారం. ఈ వార్త అధికారికంగా త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించినున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇకపోతే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 


మే నెలలో ఆచార్య సినిమా కి సంబంధించిన కీలకమైన చిత్రీకరణ జరగాల్సి ఉండగా... కరోనా దెబ్బకి అది వాయిదా పడింది. ఒకవేళ కరోనా మహమ్మారి మనదేశంలో ప్రవేశించక పోతే... లాక్ డౌన్ విధించకపోయేవారు... ఆచార్య చిత్రీకరణ ఎప్పుడో పూర్తయి... ఈపాటికే రామ్ చరణ్, చిరంజీవి వెండితెరపై అభిమానులకు కన్నుల విందు చేసేవారు. ఏది ఏమైనా రామ్ చరణ్ సరసన మొదటగా సమంత అనుకున్నారు, ఆ తర్వాత కియారా అద్వానీ అనుకున్నారు కానీ చివరికి రష్మిక మందన ని సెలెక్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: