సమంత, పూజా హెగ్డే కలిసి ఇంతవరకు నటించలేదు. ఇద్దరికీ పరిచయం కూడా లేదు. కానీ.. ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. హ్యాకర్స్ ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టారు.

 

పూజా హెగ్డే ఇన్ స్టా గ్రామ్ ఆ మధ్య హ్యాకింగ్ కు గురైంది. దీంతో తన టెక్నికల్ టీమ్ తో ఇన్ స్టా ఖాతాను పునరుద్దరించింది పూజా. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూజా ఖాతా నుంచి సమంతపై అభ్యంతకర పోస్ట్ చేశారు. ఇన్ స్టా పునరుద్దరించిన తర్వాత సమంతపై పెట్టిన పోస్టులను పూజా తొలగించింది. 

 

హ్యాకింక్ రాయుళ్లు ఉన్నట్టు ఉండక.. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను పూజా ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఆమె నా అంత అందంగా కనిపించదని పూజా అన్నట్టు కామెంట్ చేశారు. ఇది సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. సమంతకు సారి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తన అకౌంట్ హ్యాక్ కు గురైందని పూజా వివరణ ఇచ్చినా.. సమంత ఫ్యాన్స్ పట్టించుకోలేదు. సారీ చెప్పాలంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్టర్ నందినీ రెడ్డి.. సమంతకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే చిన్మయి పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్త్రాలతో సమంతకు అండగా నిలిచారు. 

 

ఫెమినిస్ట్ అని చెప్పుకునే చిన్మయి సాటి అమ్మాయిని వేధించుకు తింటోందంటూ పూజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడతారా అంటూ నందినీ రెడ్డిపై ఫైర్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరి అటు బేబీ ఫ్యాన్స్, ఇటు బుట్టబొమ్మ ఫ్యాన్స్ ట్టిట్టర్ వేదికగా వరుస ఆరోపణలతో హీటెక్కిస్తున్నారు.  సమంత.. పూజా స్పందిస్తే గానీ ఈ రచ్చ చల్లారేటట్టు కనిపించడం లేదు. మొత్తానికి సమంత, పూజా హెగ్డే మధ్య హ్యాకర్స్ చిచ్చు రాజేశారు. ఇంకేముందీ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: