సరిలేరు నీకెవ్వరు తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మూడు భారీ సినిమాలలో నటిస్తారన్న వార్తలు వచ్చి సంచలనం అయినప్పటికి అనివార్య కారణాల వల్ల ఆ మూడు ప్రాజెక్ట్స్ లో మహేష్ నటించడం లేదు అని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో బాగా న్యూస్ వచ్చి ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు చేసింది మాత్రం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో నటిస్తాడని. 

 

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్ బాబు 27వ చిత్రంగా ‘సర్కారు వారి పాట’ ప్రారంభోత్సవం జరిగింది. సరిగ్గా ఒకరోజు ముందు అఫీషియల్ అనౌన్స్ మెంట్ అంటూ మహేష్ బాబు సినిమా అప్‌డేట్ ని ఇచ్చారు. అందులో సమయం కూడా తెలిపారు. అన్నట్టుగానే అధికారంగా మహేష్ బాబు పరశురాం ల సినిమాని అధికారంగా ప్రకటించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ప్రాజెక్ట్ ని కన్‌ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాను జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి మైత్రి మూవీస్ అండ్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థుతులను దృష్ఠిలో పెట్టుకొని మహేష్ మైత్రి మూవీస్ 14 రీల్స్ వారికి నిర్మొహమాటంగా హడావుడి వద్దని సూచించారు.

   

మహేష్ బాబు సూచన మేరకు అతి తక్కువ సభ్యులతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఎప్పటిలాగే మహేష్ బాబు ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. చెప్పాలంటే ఈ విషయంలో మరోసారి సెంటిమెంట్ ని ఫాలో అయినట్టే . ఇక షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను అతి త్వరలోనే ప్రకటించనున్నారట.

 

ఇక ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు మహా మాసీగా అద్భుతంగా ఉన్నాడు. వరసగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి క్లాస్ సినిమాలు చేసిన మహేష్ ఈసారి భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకి మహేష్ లుక్ పెద్ద ప్లస్ కాబోతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: