కొన్నిరోజులుగా ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదన్నా ఉందంటే అది చిరంజీవి బాలకృష్ణల అంశమే. చిరంజీవి ఇంట్లో మంత్రి తలసానితో జరిగిన మీటింగ్ కు నన్ను పిలిచారా.. భూములు పంచుకుంటున్నారా..?’ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ బాంబుల్లా పేలాయి. ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య అయినా ఇదే టాపిక్ రన్ అవుతుంది. దీనిపై వెర్సటైల్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ సైతం స్పందించాడు. ఓ మీడియా చానెల్ లో చిరు-బాలయ్య అంశంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు సూటిగా ప్రాక్టికల్ సమాధానం ఇచ్చాడు.

 

 

నాకు బాలకృష్ణ గురించి తెలుసు.. చిరంజీవి అన్నయ్య గురించి తెలుసు. అన్నయ్య చిరంజీవికి పెద్దరికం ఉంది. నిజానికి నన్నెందుకు పిలవలేదని నేను కూడా అనుకుంటాను. కానీ.. ఆయనే తర్వాత పిలుస్తారు. ప్రతి మీటింగ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు కదా.. అని నేను ఆలోచిస్తాను. బాలయ్య గురించి కూడా మీరడిగారని చెప్తున్నా.. నన్ను పిలవలేదని బాలయ్య అనడం.. ఇలాంటి విషయాల్లో ఇగోల జోలికి వెళ్లడం కూడా అనవసరం.. మీడియా కానీ ఇతరులు కానీ.. ఎవరైనా దీన్ని పెద్దది చేసి చూపడం కూడా కరెక్ట్ కాదు. అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ అంశంపై ఇంకా వేడి చల్లారలేదనే చెప్పాలి. అక్కడక్కడా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.

 

 

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ అంతా ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. షూటింగ్స్ కోసం ఏపీ నుంచి అనుమతులు వచ్చినా తెలంగాణ నుంచి ఇంకా పర్మిషన్ రావాల్సి ఉంది. మరోవైపు ఈ అంశం ఎటు వెళ్తుందో.. ఎన్నాళ్లు వార్తల్లో నిలుస్తుందో.. ఎప్పుడు సెటిల్ అవుతుందో అర్దం కాని పరిస్థితి. గొడవలన్నీ త్వరలోనే సద్దుమణిగి షూటింగ్స్ ప్రారంభమవ్వాలని ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: