తెలుగు చిత్ర పరిశ్రమ లో కొత్త హీరోయిన్ల కు కొదవ లేదు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా మంది ఇప్పుడు టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో కొనసాగుతున్నారు.. ముకుందా సినిమా తో తెలుగు ప్రేక్షకు లకు పరిచయ మైన హీరోయిన్  పూజా హెగ్డే.. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. సినిమా సినిమా కు తన లోని టాలెంట్ ను పెంచుకుంటూ పోతూ కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేస్తుంది..

 

 

 

పూజా హెగ్డే అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అయింది.. ముకుందా సినిమా తో ప్రేక్షకు లను పలకరించిన ఈ ముద్దు గుమ్మ తన నటన తో మొదటి సినిమా తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా అంతా హిట్ అవ్వకుండా కూడా అభిమాను లను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా తో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. ఆ సినిమా లు ఎక్కడ హిట్ అయిన దాకలు లేవని చెప్పాలి.

 

 


హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందిన సినిమా డీజే( దువ్వాడ జగన్నాథం) ఈ సినిమాలో తన అందాలను కాస్త ఎక్కువ గానే ఆరబోసింది.. ఒక్కసారిగా బికినీలో దర్శనమిచ్చింది.. కుర్రాళ్ల గుండెల్లో రొమాంటిక్ వీణ మోగించింది.. ఆ సినిమాలో అమ్మడు అందానికి ఫుల్ మార్కులు పడ్డాయి.. దాంతో పూజ స్థాయి ఎక్కడికో పోయిందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మంచి టాక్ ను తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాలో నటించింది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తుంది.. మొత్తానికి పూజ ఒక్క సినిమాతో జాతకం మారిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: