దేశంలో జనతా కర్ఫ్యూ తర్వాత మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలైంది. దాంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంభించిపోయాయి.. ముఖ్యంగా రవాణా వ్యవస్థ అంతా ఆగిపోయింది. ఈ మద్య వలస కార్మికులను ఇంటికి వెళ్లొచ్చు అని కేంద్ర ప్రకటించినప్పటి నుంచి వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తునాడు నటుడు సోనూ సూద్. పేద వలస కార్మికులను గురించి వారికి ఆహారం అందించడమే కాదు.. సొంత ఖర్చుతో బస్సుల్లో వారి ఇంటికి పంపిస్తున్నారు.. ఈ మద్య ఏకంగా ఓ ఫ్లైట్ లోనే పంపించారు. ఇలా ఎంతో మందిని ఆదుకుంటున్న సోనూసూద్ ని యావత్ భారత దేశం మెచ్చుకుంటుంది.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపిస్తున్న రియల్ హీరోకి హ్యాట్సాప్ అంటున్నారు.
అంతే కాదే వేలల్లో అతనికి సోషల్ మాద్యమం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోనూ సూద్ ను పలువురు అభినందిస్తుండగా, మరికొందరు విచిత్రమైన కోరికలను కోరుతూ, వాటిని తీర్చాలని అడుగుతున్నారు కూడా. ఇటీవల ఓ వ్యక్తిని తనని ఇంటి నుండి వైన్ షాపుకి తరలించాలని కోరగా, దానికి సోనూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. తాజాగా సూనూ సూద్ కి మరో విందైన అనుభవం ఎదురైంది. . తాజాగా ఓ మహిళ తనని అమ్మగారి ఇంటికి పంపాలని కోరింది.
జనతా కర్ఫ్యూ నుండి లాక్డౌన్ 4 వరకు నేను నా భర్తతో కలిసి ఉంటున్నాను. నన్ను నా తల్లిగారి ఇంటికి పంపుతారా..! నేను అతనితో ఉండలేకపోతున్నాను అని ట్విట్టర్ వేదికగా సోనూసూద్ని కోరింది. దీనికి స్పందించిన సోనూసూద్.. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇద్దరిని గోవాకి పంపుతాను. ఏమంటారు అని ట్వీట్ చేశాడు. ఇలా విమర్శిస్తూ కూడా వారికి విడిపోవద్దూ అంటూ చమత్కరించిన సోనూ సూద్ ని నిజంగా మెచ్చుకోలేకుండా ఉండలేం అంటున్నారు నెటిజన్లు.
I have a better plan .. let me send both of you to Goa😂 What say? https://t.co/XbYNFWWflK
— sonu sood (@SonuSood) May 31, 2020