ఇప్పుడు టాలీవుడ్ లో ఏదైనా ఆసినిమా వస్తుంది అంటే చాలు సినిమా గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. సినిమాలో హీరోయిన్ ఎవరు సినిమాలో ఎవరు నటిస్తున్నారు కథ ఏ విధంగా ఉంది. సినిమాల ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది సహా అనేక విషయాల మీద చర్చలు రకరకాలు గా జరుగుతూ ఉంటాయి. ఇక దీనిని మార్కెట్ గా మార్చుకునే ప్రయత్నాలను ఇప్పుడు టాలీవుడ్ లో చేస్తున్నారు. సినిమా ప్రకటనల విషయంలో ఇప్పటి వరకు హీరోలు నిర్మాతల నుంచి ప్రకటనలు ఎక్కువగా వస్తు ఉండేవి. అయితే ఇప్పుడు దీనిని మార్కెట్ గా మారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. 

 

అవును మహేష్ సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలయ్యే అవకాశం ఉంది. నిర్మాతలు నష్టాల నుంచి బయటకు రావడానికి గానూ ఈ విధంగా అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.  సినిమా హీరోయిన్ సహా అనేక ప్రకటనలను ఒక సంస్థకు ఇస్తారు. సోషల్ మీడియాలో ఇక ఆ సంస్థ మొత్తం బాధ్యతలు అన్నీ చూస్తుంది. అవును ఆ సంస్థ నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఏదైనా వస్తుంది. హీరోయిన్ నుంచి ప్రతీ ఒక్కటి కూడా అందులోనే ప్రకటిస్తారు. పాటలను కూడా ఆ సంస్థ సహకారం తోనే విడుదల చేస్తారు. అదే విధంగా ఫస్ట్ లుక్ కూడా... 

 

ఇక ట్రైలర్ లు సహా అనేక విషయాలను వారి తో ఒప్పందం చేసుకునే విడుదల చేస్తూ ఉంటారు. దీనితో మార్కెట్ ని పెంచుకునే అవకాశం దర్శక నిర్మాతలకు దొరుకుతుంది. దీని ద్వారా నష్టాల నుంచి బయటకు రావొచ్చని దీని ఒప్పందం కోటి నుంచి ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి ఇది ఎంత వరకు ఆచరణ లోకి వస్తుంది అనేది చూడాలి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.  మరి వర్క్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: