ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో గత రెండు నెలలు దర్శకులు తదుపరి సినిమాల కోసం ఇంటి వద్దనే స్క్రిప్ట్ విషయంలో కుస్తీ పడ్డారు.  ప్రస్తుతం మహేష్ బాబు గీతాగోవిందం ఫేమ్ పరుషరామ్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి నిన్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా టైటిల్ రివీల్ చేశారు. మహేశ్ బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' టైటిల్ పోస్టర్ రిలీజ్! ఇంకేముంది, సోషల్ మీడియాలో ఎంబీ ఫ్యాన్స్ కోలాహలం మిన్నంటింది. 

 

ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజైన 'సర్కారు వారి పాట' టైటిల్ పోస్టర్ టాలీవుడ్ రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక పోస్టులు పొందిన పోస్టర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ కు దాదాపు 33 వేల సోషల్ పోస్ట్ లు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఫస్ట్ లుక్ కి ఈ రేంజ్ రాలేదు. తెలుగు చిత్రసీమలో మరే సినిమా ప్రీలుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో ఈ స్థాయి స్పందన రాలేదు.

 

ఇక, లైకుల విషయంలోనూ మహేశ్ బాబు కొత్త మూవీ పోస్టర్ మోత మోగిస్తోంది. ఇప్పటివరకు 85 వేలకు పైగా లైకులు వచ్చాయి.   మెడపై రూపాయి బిళ్ల టాటూ, చెవికి రింగు... మహేశ్ అప్పియరెన్స్ పై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పరశురామ్ కు వస్తున్న అభినందనలకైతే లెక్కేలేదు. టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు పరశురామ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: