తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో వచ్చేసి ఇక్కడే సెటిల్ అయింది. టాప్ రేంజి హీరోలు పక్కన ఆమె నటించి తన సత్తా చాటుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ అందం ఎక్కడా తగ్గలేదు. అభినయం కూడా ఇంకా మరో రెండు మెట్లు ఎక్కింది. ఇక అనుభవం కూడా పెరిగింది. ఇపుడు ఆమెకు టాలీవుడ్లో సరైన ఆఫర్లు లేవు.

 

యంగ్ హీరోలంతా కొత్తదనం కోసం చూస్తున్నారు. దానికి తోడు రకుల్ ఈ మధ్య చేసిన సినిమాలు కూడా ఆడలేదు. ఇక రకుల్ చేసిన మరో తప్పు సీనియర్ హీరోల పక్కన నటించడం. పైగా ఆ సినిమాలు ఆడలేదు కానీ రకుల్ ఇమేం డ్యామేజ్ అయింది. ఆమెను యంగ్ హీరోలు పూర్తిగా పక్కన పెట్టారు

 

ఇవన్నీ ఇలా ఉంటే మళ్లీ తన గ్లామర్ ని చూపించి టాలీవుడ్లో దూసుకుపోవడానికి రకుల్  తనదైన ప్లాన్స్ చేసుకుంటోంది. దానికి లాక్ డౌన్ని ఆమె బాగా యూజ్ చేసుకుంటోంది. ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ పెడుతూ అక్కడ తన సత్తా చాటుతోంది. రకుల్ కి ఇన్స్టాగ్రాం లో ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగి ఇపుడు ఏకంగా 14 మిలియన్లు గా ఉన్నారు. 

 

దాంతో ఈ అమ్మడు తెగ ఖుషీ అవుతోంది. తన గ్లామర్ తో అక్కడ కిర్రెక్కిస్తోంది. ఇదిలా ఉండగా రకుల్ కి లాక్ డౌన్ బొత్తిగా బోర్ గా ఉందని అంటోందిట. షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ ఫ్యాన్స్ తో టైం పాస్ చేస్తున్నా మనసు మాత్రం షూటింగుల మీదనే ఉందని చెబుతోంది.

 

మరి కొద్ది రోజుల్లో ఎటూ షూటింగులకు అవకాశం ఇస్తారు. అందువల్ల రకుల్ కి బోర్ తప్పే చాన్స్ ఉంది కానీ ఆమె చేతిలో పెద్ద సినిమాలు లేకపోవడమే లోటు గా చెప్పాలి. ఏది ఏమైనా తన గ్లామర్ పిక్స్ తో ఇన్స్ట్రాగ్రాం లో కాక రేపుతున్న రకుల్ అట్నుంచి నరుక్కురావాలనుకుంటోందిట. తనకు ఆ విధంగానైనా చాన్సులు వస్తాయేమోనని ఎదురుచూస్తోందిట.  మరి ఆమె లక్ మారుతుందా. లాక్ డౌన్ తరువాత అయినా ఫుల్ బిజీ అవుతుందా. వెనకటి వైభవం దక్కుతుందా వెయిట్ అండ్ సీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: