రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంలో మలయాళ స్టార్ జయరాం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందు జయరాం, భాగమతి, అల.. వైకుంఠపురములో నటించగా ఈరెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి. మరి ప్రభాస్ సినిమా కూడా ఈ సెంటిమెంట్ కలిసొస్తుందో చూడాలి. తదుపరి షెడ్యూల్ లో జయరాం షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఇదిలావుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఎప్పటినుండో అభిమానులు ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే దానికోసం చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను పలు సార్లు ట్రోల్ చేశారు. ఇక వారి బాధ తట్టుకోలేక ఎట్టకేలకు ఫస్ట్ లుక్ ను విడుదలచేయడానికి రెడీ అవుతుంది. జూన్ రెండో వారంలో టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదలకానుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది ఈ చిత్రంలో ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట.
 
ఇటీవలే జార్జియాలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగనుంది. జూన్ చివర్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరక్కుతున్న ఈ చిత్రానికి ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా తెలుగు తోపాటు తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదలకానుంది అయితే ఇంకా ఈచిత్రానికి సంగీత దర్శకుడిని ఖరారు చేయలేదు. ఈసినిమా తరువాత ప్రభాస్ తన 21వ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: