సరిలేరు నీకెవ్వరు తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు తన తాజా చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 27వ సినిమా సర్కారు వారి పాట. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ లోనే చాలా విషయాలు ఇన్‌డైరెక్ట్  గా రివీల్ చేశాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమా కథ కూడా పక్కా కమర్షియల్ పంథాలోనే సాగుతుందని అర్థమవుతోంది.

 

ఇన్ని రోజులు ఎమోషనల్ కథలు రాసుకుంటూ వచ్చిన దర్శకుడు పరశురామ్..ఈ సారి మహేష్ బాబు కోసం పక్కా మాస్ కథను సిద్ధం చేసాడు. అంతేకాదు గత కొంతలాకంగా మహేష్ బాబు కూడా ఇలాంటి మాస్ కథలో చేయలేదని తెలిసిందే. ఈ విషయం ఆయన గత చిత్రాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చూస్తే అర్థమవుతుంది. 

 

అయితే సరిలేరులో మాస్ ఎలిమెంట్స్ టచ్ చేసినప్పటికి పక్కా మాస్ సినిమా కాదని తెలిసిందే. ఈ సారి ఫ్యాన్స్ కి ఆ సరదా మొత్తం తీర్చబోతున్నారు మహేష్ పరశురామ్.
 ఇక ఇప్పటి వరకు సూపర్ స్టార్ కెరీర్ లోనే చేయనటువంటి కథ ని పరశురామ్ రాశాడట. ఆయన ఇమేజ్ కు సరిపోయేలా ఓ ఆర్థిక నేరగాడి కథ సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.  సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు పాత్ర మీదే పోలీసుల కన్ను ఎప్పుడూ ఉంటుందని.. మోసం చేసే పాత్రలో మహేష్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

 

ఈ నేపథ్యంలోనే డబ్బుకు గుర్తుగా మెడపై రూపాయి చిహ్నాన్ని టాటూగా ముద్రించు కున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే కథ ఇది అంటున్నారు దర్శక నిర్మాతలు. పైగా చెవిపోగుతో కనిపిస్తున్న లుక్ .. ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి సర్కారు వారి పాట మీద విపరీతంగా ఆసక్తి కలుగుతోంది. ఏడు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు సినిమాకు మళ్లీ థమన్  సంగీతం అందిస్తున్నారు.

 

షూటింగ్ జూలై లొ స్టార్ట్ కానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. 2021లో ఈ సర్కారు వారి పాట విడుదల కానుంది.  ఇక ఈ క్లూస్ అన్నీ చూస్తుంటే మరోసారి పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల మాదిరిగా ఎన్ని రికార్డులు బద్దలవుతాయో అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: