సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా అనంతరం వంశీ పైడిపల్లి ఏ హీరోతో చేస్తాడన్నది ఇంతవరకూ కన్ఫర్మ్ కాలేదు. మహర్షి తర్వాత మళ్ళీ వంశీ దర్శకత్వంలో చేయడానికి ఆసక్తి కనబరిచిన మహేష్, వంశీ చెప్పిన కథ నచ్చక పరశురామ్ తో సర్కారు వారి పాట ని స్టార్ట్ చేశాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే వంశీ పైడిపల్లి మాత్రం తన తర్వాతి చిత్రం ఏ హీరోతో ఉంటుందనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు.

 

అయితే వంశీ గత కొన్ని రోజులుగా స్టార్ హీరో కోసమే తిరుగుతున్నాడని టాక్. మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత రామ్ చరణ్ ని సంప్రదించాడని టాక్. ఎవడు సినిమాతో రామ్ చరణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన వంశీకి రామ్ చరణ్ మళ్ళీ అవకాశం ఇస్తాడో లేదో తెలియదు. అదీ గాక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ మరో సంవత్సరం వరకు దొరికే ఛాన్స్ లేదు.

 

అందువల్ల వంశీ- రామ్ చరణ్ ల కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో ప్రారంభం అవ్వదు. మరి ఈ సమయంలో వంశీకి మిగిలింది చిన్న హీరోలే. చిన్న హీరోలతోగానీ, లేదా మిడ్ రేంజ్ హీరోలతో గానీ సినిమా తీస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వంశీపైడిపల్లి వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వెబ్ సిరీస్ కల్చర్ తెలుగులో బాగా పెరిగింది.

 

అల్లు అరవింద్ ఆహా కోసం వెబ్ సిరీస్ లని రూపొందించే పనిలో పడ్డాడు. దానికోసం చాలా మంది దర్శకులని కాంటాక్ట్ అవుతున్నాడట. ఈ నేపథ్యంలోనే వంశీని కలుసుకున్నాడని టాక్. మరి వంశీ ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తాడా లేదా చూడాలి. స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తూ ఉండడం కంటే చేతికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: