స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కేరళ అడవుల్లో షూటింగ్ జరుపుకోగా ఇప్పుడు ఆ రష్ అంతా తీసేయాలని నిర్ణయించుకున్నారట చిత్రయూనిట్. వెస్ట్ గోదావరిలో కొత్త షెడ్యూల్ తో సినిమా మళ్ళీ మొదటినుండి స్టార్ట్ చేస్తారట. సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు. అయితే మెయిన్ విలన్ తెలియదు కానీ సినిమాలో లేడీ విలన్ గా రోజా నటిస్తుందని తెలుస్తుంది. 


ఇప్పటికే సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఉంటుందని వార్తలు రాగా రోజా కూడా పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. ఓ పక్క పాలిటిక్స్ తో బిజీగా ఉంటూ మరో పక్క బుల్లితెర మీద షోలు చేస్తూ.. ఛాన్స్ వస్తే సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు రోజా. తన దాకా వచ్చిన అవకాశాన్ని చేయనని చెప్పడం ఆమెకు అలవాటు లేదు అందుకే ఎవరు ఎలాంటి ఛాన్స్ ఇచ్చినా క్యారక్టర్ నచ్చితే చేసేస్తుంది. గోలీమార్, శంభో శివ శంభో సినిమాల్లో నటించి మెప్పించిన రోజా మరోసారి తన విలనిజం చూపిస్తారని అంటున్నారు. 


రంగస్థలంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2021 సంక్రాంతికి సినిమా రిలీజ్ అనుకుంటున్నా అది సమ్మర్ కి వెళ్తుందని టాక్. 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎనౌన్స్ చేసినా అది కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: