దేశంలో కరోనా ఎప్పుడైతే మొదలైంది.. చిన్నా పెద్ద తేడా లేకుండా ఎవరికైనా నేనున్నా అంటూ వచ్చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనాతో ఇప్పటి కే పలువురు సెలబ్రెటీలు మరణించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 62 వేల మందికిపైగా కరోనా బాధితులుండగా వారిలో రెండువేలమందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న ఖుష్బూ బంధువు, కరోనా సోకి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిర్మాత కరీంమొరానీ తో సహా ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్(42). కిడ్నీ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయనకు కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి.
గుండె సంబంధిత సమస్యలతోనూ చికిత్స పొందుతున్న వాజిద్ ఖాన్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ పిన్న వయసులోనే చనినపోవడంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. లా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీనటి కుమారి సింగ్తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే వారిని ఐసోలేషన్కు తరలించారు.
తామంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్కు వ్యాధి సోకిందని చెప్పారు. త్వరలోనే కోలుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు. మోహెనా కుమారి సింగ్ ‘యే రిష్టా క్యా కహ్లేతా హై’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. గతఏడాది అక్టోబరులో ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి కుమారుడు సుయేష్ రావత్ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె డెహ్రాడూన్ నగరంలోని అత్తవారింట్లో నివాసముంటున్నారు.