టాలీవుడ్ లోకి ఉత్తరాది నుంచి హీరోయిన్లు రావడం కొత్తేమీ కాదు. కొందరు హీరోయిన్లు తెలుగులో తొలిసారి ఎంటర్ అయితే.. మరికొందరు మోడలింగ్ నుంచి వచ్చి తెలుగులో తెరంగేట్రం చేస్తారు. వీరిలో అందం, టాలెంట్, లక్ ఉంటే.. వారికి తిరుగుండదు. ఆ రెండో కోవకు చెందిన హీరోయినే రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ చూసిన రకుల్ కు ప్రస్తుతం ఆఫర్లు లేవు. సినిమాలే లేవు కానీ రకుల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని సోషల్ మీడియా క్రేజ్ ప్రూవ్ చేస్తోంది.
రీసెంట్ గా రకుల్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య 14మిలియన్లకు చేరింది. ఈ సంఖ్య చాలా ఎక్కువ. దీని గురించి రకుల్ బేబీ అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ మెసేజ్ చేసింది. నా ఆనందమంతా ఈ ఫొటోల్లోనే చూడండి అంటూ రీసెంట్ ఫొటోషూట్ లోని ఫొటోలు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో రకుల్ కు ఇన్స్ స్టా ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ట్విట్టర్ లో ఆమెకు 4మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇది నిజంగా గొప్ప విషయమే. పలు బాలీవుడ్ సినిమాలు చేసింది.
రకుల్ పై రాంగ్ కామెంట్లు, పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. దీంతో రకుల్ కు నేషనల్ లెవల్ అటెన్షన్ ఉంటుంది. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తోనే హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడంతో అమ్మడి హవా కొనసాగింది. నితిన్ తర్వాతి సినిమాలో రకుల్ కు అవకాశం దక్కిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం తమిళ్, హిందీలో పలు ప్రాజెక్టులు చేస్తోంది.
View this post on InstagramPhotography is a story that One fails to put in words . Clearly I can’t put in words how grateful I am for my insta family growing to 14 MILLION ❤️❤️ So various moods of meeee when iam just soo happy 😜 sending all of you lots of love and positivity ❤️. #homeposer #desivibes