గత రెండునెలలు గా సినీ రంగం స్థంభించిపోయింది. షూటింగ్ లు లేక  స్టార్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు.  అయితే ఇటీవల ప్రభుత్వం అతి తక్కువ మంది తో జూన్ నుండి షూటింగ్ లను జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది దాంతో మళ్ళీ సెట్ లో అడుగుపెట్టడానికి  కొందరు స్టార్లు రెడీ అవుతుండగా మరి కొందరు మాత్రం భయం తో వెనకడువేస్తున్నారు. ఈజాబితాలో బాలయ్య  మొదటి స్థానంలో వున్నాడు.
 
తాజాగా ఓ యు ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓవైపు కరోనా  విజృంభిస్తుంటే ఈపరిస్థితులో షూటింగ్ లకు పర్మిషన్ అడగడం ఏంటని తప్పుబట్టాడు. ఒక్క సారి షూటింగ్ స్టార్ట్ అయితే ఎక్కువ మంది పోగవడం ఖాయం. ఇలాంటి టైంలో షూటింగ్ ఆలోచన విరమించుకోవాలి అని బాలయ్య వ్యాఖ్యానించాడు. సో బాలయ్య అయితే ఇప్పట్లో సెట్ లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని  చెప్పకనే చెప్పాడు. 
 
ఇక అలాగే ఇండస్ట్రీ నుండి అత్యధికంగా టాక్స్ చెల్లిస్తున్నాం.ప్రభుత్వాన్ని అడిగితే రెండు ఎకరాలు ఇవ్వదా...ఇంతవరకు మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కోసం ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేకపోయారని సినీ పెద్దల పై విరుచుకుపడ్డాడు. మరో వైపు భూములు పంచుకుంటున్నారు అని చేసిన వ్యాఖ్యల పై మాత్రం బాలయ్య స్పందించలేదు. ఇదిలావుంటే ప్రస్తుతం బాలయ్య , మోనార్క్ లో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇటీవలే వారం రోజుల షూటింగ్ జరుపుకోగా అందులో యాక్షన్ సన్నివేశాలను  తెరకెక్కించారు. ఈఏడాది చివర్లో ఈసినిమా  థియేటర్లలోకి తీసుకురానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: