‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలు జరిగింది. అయితే రిజల్ట్ మొదటి షోకే అట్టర్ ఫ్లాప్ అని రావడంతో ప్రభాస్ రెండు సంవత్సరాల కష్టం వృధా కావటం టైం వేస్ట్ అవ్వటంతో ‘సాహో’ సినిమా పరాజయాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేమకథా నేపథ్యంలో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
యు.వి.క్రియేషన్స్ మరియు సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలైన కానీ ఇప్పటివరకు ఫస్ట్ లుక్ ఎలాంటి విషయాలు కూడా బయటికి చెప్పలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎప్పటినుండో సోషల్ మీడియాలో సినిమా యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా..? అంటూ క్లారిటీ అడుగుతున్నారు.
విమర్శలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఫస్ట్ లుక్ జూన్ నెల సెకండ్ లేదా థర్డ్ వీక్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వచ్చే సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.