తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తన అందచందాలతో అభినయంతో నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక తన హాట్ హాట్ అందాలతో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అటు  సోషల్ మీడియాలో కూడా తమన్నా ఎప్పుడు యాక్టివ్ గానే  ఉంటుంది. అయితే ఎప్పుడు బిజీ బిజీగా ఉండే  సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలు కావడంతో.. సినిమా షూటింగ్ లు అన్నీ నిలిపివేయడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దాదాపుగా 50 రోజులకు పైగా సినిమా షూటింగులు నిలిచిపోగా సినీ సెలబ్రిటీల అందరూ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. 

 


 ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన అప్డేట్లను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు సినీ ప్రముఖులు. అయితే తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేసింది... టీ షర్ట్ వేసుకుని ప్రశాంతంగా కూర్చుని రిలాక్స్ అవుతున్నా ఒక ఫోటో ని మిల్కీ బ్యూటీ తమన్నా తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోపై  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది తమన్నా. అంతా అయిపోయిన తర్వాత నన్ను నిద్ర లేపండి అంటూ పోస్ట్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 


 అయితే ప్రస్తుతం ఇంటికే పరిమితమైన నేపథ్యంలో తమన్నా ఎక్కువగా ఫిట్నెస్ పై  దృష్టి పెట్టడంతో పాటు... తన గ్లామర్ ని మరింత పెంచుకునే పనిలో పడిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తమన్నా గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తో పాటు బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్ధిఖి సినిమాలో నటిస్తోంది. సినిమా చిత్రీకరణకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నాయి. కాగా ప్రస్తుతం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా ఎక్కువ సమయం ఖాళీ టైం దొరకడం తో... చాలా మంది హీరోయిన్లు వంటింట్లో కూడా సమయం గడుపుతున్నారు .

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Wake me up when it’s all over 🐷🐷🐷

A post shared by tamannaah Bhatia (@tamannaahspeaks) on

మరింత సమాచారం తెలుసుకోండి: