‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కెరీర్ బిగినింగ్ లో ఇబ్బంది పడ్డారు. సరైన హిట్ కోసం చూస్తున్న సమయంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ సూపర్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చాడు ప్రభాస్. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి’ తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన బాహుబలి జాతీయ స్థాయింలో సెన్సేషన్ సృష్టించింది. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. అప్పటి వరకు సీనీ పరిశ్రమలో ఉన్న రికార్డులు మొత్తం బ్రేక్ చేసింది. ఇలా జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ ఆ గత ఏడాది ‘సాహెూ’ సినిమాతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు.
బాలీవుడ్ లో కాస్త పరవాలేదు అనిపించినా ఇతర భాషల్లో డిజాస్టర్ టాక్ వచ్చింది. దాంతో తన తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు పడుతున్నారు ప్రభాస్. జాతీయ స్థాయిలో ఇమేజ్ ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 20వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ జార్జియా వెళ్లిన ఈ చిత్ర బృందం ప్రతీకూల పరిస్థితుల్లోనూ అక్కడి లొకేషన్లలో కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుని విజయవంతంగా ఇండియా తిరిగి వచ్చింది.
యువీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. మరి త్వరలో తెలుగు నాట షూటింగ్స్ జరుపుకునేందుకు పరిమిషన్ వచ్చింది.. జూన్ మొదటి వారంలో అయినా ఫస్ట్లుక్, టైటిల్ని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ మద్య త్వరలోనే ఫస్ట్లుక్ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. కానీ చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాఏదు. ఈ నెల మొదటి వారంలో అయినా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేయాల్సిందేనని ప్రభాస్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నట్టు తెలిసింది.