టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కావాలని పోటీపడే హీరోలలో మహేష్ బాబు - అల్లు అర్జున్ ఒకరు. ఇద్దరూ తాము నటించిన సినిమాలు ఇటీవల ఒకేసారి విడుదల చేస్తూ బాక్సాఫీస్ దగ్గర నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బన్నీ ‘అలా వైకుంఠపురములో’ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో రిలీజ్ తేదీ ల విషయంలో సేమ్ డేట్ ప్రకటించి పోటీకి తెరలేపారు. అయితే ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకోవటం తో విషయం సద్దుమణిగి మొదట మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వగా తర్వాత అల్లు అర్జున్ సినిమా విడుదలైంది.

IHG

అయితే సంక్రాంతికి పోటీ గా వచ్చిన ఈ రెండు సినిమాలలో అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురం లో’ సంక్రాంతి పండుగకు బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. పరిస్థితి ఇలా ఉండగా మహేష్ బాబు తాజాగా  ఇండైరెక్ట్ గా బన్నీ ని ఫాలో అవుతున్నట్లు తను తాజాగా స్టార్ట్ చేసిన కొత్త సినిమా ‘స‌ర్కారు వారి పాట‌’ టీమ్ చూస్తే అర్థ‌మైపోతుంది. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ `టీమ్ లో పని చేసిన స‌గం మంది ‘స‌ర్కారు వారి పాట‌’లో క‌నిపిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, క‌ళా ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్‌, కెమెరామెన్ వినోద్‌.. వీళ్లంత ‘అల వైకుంఠ‌పుర‌ములో’ టీమే. ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.

IHG

ఆమె కూడా ఖాయ‌మైపోతే, డైరెక్టర్ మరియు బ్యానర్ తప్ప దాదాపు బన్నీ ‘అలా వైకుంఠపురం లో’ సినిమాకి పని చేసిన వాళ్లే ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమాకు పని చేస్తున్నారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా గతంలో బన్నీ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి లో విలన్ గా నటించిన ఉపేంద్ర ని ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయించడానికి మహేష్ - పరుశురాం ఆలోచిస్తున్నాట్లు ఫిలిం నగర్ టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: