ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. టాలీవుడ్ లో ఉన్న పెద్దలు ఇక్కడ సినిమాలను షూట్ చేయడానికి గానూ సినిమా పెద్దలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక సినిమాల షూటింగ్ కోసం ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు కొందరు తెలంగాణా సర్కార్ ని కూడా కలిసిన సంగతి తెలిసిందే. మరి సినిమాల షూటింగ్ కి అక్కడి ప్రభుత్వం ఏ విధంగా అంగీకరిస్తుంది అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

 

ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు అన్నీ కూడా విడుదలకు కూడా సిద్దంగా ఉన్నాయి. ఇక ఏపీ ప్రభుత్వానికి మహేష్ బాబు లేఖ కూడా రాసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఎప్పుడు లేఖ రాస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ కి ఒక లేఖ రాసే సూచనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏపీ సర్కార్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. సినిమాల షూటింగ్ కి విదేశీ నటులను ఎపీలోకి అనుమతించవద్దు అనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం. 

 

ఇదే విషయాని ఇప్పటికే చెప్పారు అని అంటున్నారు. ఈ నెల 8 నుంచి పర్యాటక రంగానికి అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. ఇక అప్పటి నుంచే సినిమాల షూటింగ్ కి కూడా అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు అయినా వస్తే ఏపీ సర్కార్ క్వారంటైన్ అని కచ్చితంగా చెప్తుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారు సినిమాల విషయం లో అనేది చూడాల్సి ఉంది. త్వరలోనే స్పష్టత వస్తు౦ది.

మరింత సమాచారం తెలుసుకోండి: