ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్ జీవిత చరిత్ర ఆదారంగా వచ్చిన ‘యాత్ర’ మరో సక్సెస్ అందుకుంది.  ఇక క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ ’ బయోపిక్ నుంచి వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ’ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  ఇదిలా ఉంటే మాలీవుడ్ బ్యూటీ నిత్యామీనన్  విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తోంది.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో మంచి సక్సెస్ అందుకుంటూ వస్తుంది.   గీత గోవిందం, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రాల్లో ప్ర‌త్యేక అతిథి పాత్ర‌ల్లో న‌టించిన నిత్యామీన‌న్ ఈ మ‌ధ్య మ‌రే తెలుగు చిత్రాన్ని అంగీక‌రించ‌లేదు.

 

తాజాగా కోన వెంక‌ట్‌, ఎం.వి.వి. స‌త్య‌నారాయ‌ణ  తొలి భార‌తీయ మ‌హిళా వెయిట్ లిప్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి జీవిత క‌థ ఆధారంగా  ఓ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంజ‌న రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఇటీవ‌లే క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి పుట్టిన రోజు సంద‌ర్భంగా వెల్ల‌డించింది.  అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం పలువురు నటీమణులను సంప్రదించారట.

 

వారిలో నిత్యామీన‌న్‌ ఒకరు.. కానీ ఈ అమ్మడు ఆ చిత్రంలో నటించలేనని చాలా సున్నితంగా చెప్పినట్టు సమాచారం. చాలా మంది హీరోయిన్లు ఇలాంటి బయోపిక్ చిత్రాల్లో ఛాన్సు వచ్చిందంటే వదులుకోరు.. కానీ నిత్యా మీనన్ మాత్రం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. కార‌ణం ఏంట‌నేది మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. అయితే ఈ విషయం మాత్రం అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.. కేవలం రూమర్లు అయి ఉండొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.   గతంలో కూడా ‘మహానటి’ చిత్రాన్ని కూడా నిత్యామీన‌న్ తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: