టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా వస్తుంది అనగానే ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు సినిమా చేయడం ఏమో గాని సినీ జనాలు మాత్రం ఏ వార్త పడితే ఆ వార్తను సోషల్ మీడియా లో ప్రచారం చేస్తూ ఎవరి సందడి వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే ఈ సినిమా విషయంలో ఇప్పుడు మహేష్ బాబు కాస్త దూకుడుగా ఆలోచిస్తున్నాడు అని సమాచారం. 

 

దీని కోసం గానూ అతను ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు అని సినిమా గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమా లో మహేష్ బాబు భారీగా బరువు కనపడే అవకాశం ఉందని కూడా సమాచారం. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ సినిమా కోసం అతను ముంబై కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. నిజం కాస్త ఉంటే మీడియా ఏ స్థాయిలో రాస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేసే సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుంది. 

 

సినిమా కోసం కూడా మహేష్ బాబు ఎక్కువగానే కష్టపడే అవకాశం ఉందని సమాచారం. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది స్పష్టత లేదు. ఇక మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం తో సినిమా కోసం  కొందరు నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: