బాలీవుడ్ లో సక్సెస్ అయిన భామలు టాలీవుడ్ లో సినిమాలు చేయాలంటే వెనుకడుగు వేస్తారు కానీ కియరా అద్వానీ మాత్రం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా దుమ్ముదులిపేస్తుంది. ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో నటించిన కియరా అద్వానీ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. 

 

మొదటి సినిమా హిట్ అవగా రెండో సినిమా అంచనాలు అందుకోలేదు. అయినా సరే తెలుగులో కియరాకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం బాలీవుడ్ లోనే బిజీ బిజీ అయ్యింది. హిందీలో కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అదరగొడుతుంది కియరా అద్వానీ. అయితే సినిమాలు లేదంటే వెబ్ సీరీస్ లు మాత్రమే కాదు ఖాళీ టైం లో బోల్డ్ ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు అలరిస్తుంది. తన అందాల వలలో చిక్కుకునేలా కియరా వయ్యారాలు ప్రదర్శన చేస్తుంది. 

 

లేటెస్ట్ గా మరో క్రేజీ ఫోటో షూట్ తో వచ్చింది కియరా అందులో చూపించి చూపించకుండా చేస్తున్న అందాల ప్రదర్శన ఆడియెన్స్ ను ఫిదా చేస్తుంది. టాలీవుడ్ మాత్రమే కాదు ఆమె అందానికి బాలీవుడ్ సైతం షేక్ అయ్యేలా అమ్మడు సత్తా చాటుతుంది. ఈ రేంజ్ లో రెచ్చిపోతే అమ్మడికి మరో ఐదారేళ్ళ కెరియర్ తిరుగు లేదని మాత్రం చెప్పొచ్చు. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది కియరా.                             

మరింత సమాచారం తెలుసుకోండి: