ఇపుడు టాలీవుడ్ కి మామూలుగా లేదు. సీనియర్ హీరోలు రిలాక్స్ మూడ్ లో ఉంటే కొత్త హీరోలు వేగిరపడుతున్నారు. మిడిల్ ఏజ్డ్  హీరోలకు టార్గెట్లు టెన్షన్ పెడుతున్నాయి. ఇక అదే వరసలో టెక్నీషియన్లు కూడా ఉంటున్నారు. వారికి ప్రాజెక్టులు  ఎంత వేగం అయితే బాగుంటుంది అన్న ఆరాటం ఆత్రుత ఉంటుంది. అందులో తప్పు పట్టాల్సింది కూడా ఏదీ లేదు.

 

అలాంటి డైరెక్టర్లలో ఇపుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఆయన ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ మూవీ తీశారు. ఆ సినిమా తరువాత కూడా టాప్ హీరోలు అనిల్ కి డేట్స్ ఇవ్వలేదు. దాంతో ఎఫ్ 2 నే సీక్వెల్ చేస్తూ ఎఫ్ 3 అనేశారు. ఇది కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కొడితే హ్యాట్రిక్ కొట్టినట్లుగా ఉంటుందని అనిల్ పక్కా ప్లాన్ వేసుకున్నారు. 

 

ఈ నేపధ్యంలో అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాక కరోనా మహమ్మారి వీర విహారం చేయడంతో పాటు లాక్ డౌన్ కూడా ప్రకటించారు. దాంతో ఎఫ్ 3 కధను సిధ్ధం చేసుకున్న అనిల్ రావిపూడికి వెంకటేష్ నుంచి డేట్స్ రావడం లేదు అంటున్నారు. ఈ సినిమాను నెమ్మదిగా చేద్దామని వెంకటేష్ అంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

 

దాంతో ఈ మూవీ విషయంలో అనిల్ రావిపూడి కి టెంపరరీగా బ్రేకులు పడినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ మూవీ విషయంలో చూసుకుంటే వరుణ్ తేజ్ ని తమన్నాను కూడా పెట్టి పాత కాంబోను రిపీట్ చేసి హిట్ కొట్టాలని అనిల్ ఆలోచిస్తున్నాడు. అయితే అనిల్ ఆలోచనలకు మాత్రం ఇపుడున్న సిట్యువేషన్ సహకరించడంలేదు అంటున్నారు. 

 

వెంకటేష్ నారప్ప సినిమా షూటింగు కూడా ఆగిపోయింది. అది ముందు పూర్తి అయితేనే వెంకీ ఈ కొత్త ప్రాజెక్ట్ ని టేకప్ చేసేది అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అనిల్ ఉత్సాహానికి అలా బ్రేక్ పడిందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: