ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన ఓటిటి..   ఆహా ఎట్టకేలకు ఓ క్రేజీ సినిమా డిజిటల్  హక్కులను  దక్కించుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరి. ఈసినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లవ్ స్టోరి డిజిటల్ హక్కులను ఆహా 6కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికే శాటిలైట్ హక్కులను స్టార్ మా 5.70 కోట్లకు దక్కించుకోగా హిందీ డబ్బింగ్ రైట్స్ 4కోట్లకు అమ్ముడయ్యాయి. థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీ పోటీ నెలకొంది. మొత్తం కలిపి ఈచిత్రం 40కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుంది. 
 
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మరో రెండు వారాల షూటింగ్ బ్యాలన్స్ వుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను దసరాకు విడుదలచేయాలని భావిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ ,అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇక ఈసినిమా తరువాత నాగ చైతన్య మరో సినిమా కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లవ్ స్టోరి తరువాత చైతన్య ,పరశురాం తో సినిమాచేయాల్సి వుంది కానీ  పరుశురాం, మహేష్ బాబు తో సినిమా చేయడానికి మొగ్గు చూపడం తో ఆసినిమా వాయిదాపడింది. సాయి పల్లవి మాత్రం తెలుగులో లవ్ స్టోరి తోపాటు విరాటపర్వం చేస్తుంది. వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో  సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుండగా రానా దగ్గుబాటి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: