టాలీవుడ్ ఇండస్ట్రీలో గుణశేఖర్ కి ఉన్న పాపులారిటి ఏంటో అందరికీ తెలిసిందే. తీసింది తక్కువ సినిమాలైనా గుణశేఖర్ సినిమాలకి ప్రేక్షకుల్లో అసాధారణమైన క్రేజ్ నెలకొంటుంది. ముఖ్యంగా తన మేకింగ్ స్టైల్ తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ని చాటుకున్నాడు. గుణశేఖర్ మెగాస్టార్ చిరంజీవి తో చూడాలని ఉంది, మహేష్ బాబు తో ఒక్కడు.. అర్జున్, అనుష్క తో రుద్రమదేవి సినిమాలు గుణశేఖర్ కి దర్శకుడిగా గొప్ప పేరును తెచ్చాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ఒక్కడు సినిమాకి వేసిన ఛార్మినార్ సెట్, అలాగే అర్జున్ సినిమాలో వేసిన మధుర meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి అమ్మవారి సెట్ గురించి ఇప్పటికీ ప్రత్యేకంగా చర్చించుకుంటారు.

 

అయితే గుణశేఖర్ తీసిన సినిమాల విషయంలో కథ కి తగ్గట్టు ఖచ్చితంగా సెట్ ఉండాలన్నది ఆయన పట్టుదల. ఆ సెట్ కూడా కథ లో కీలక పాత్ర పోషిస్తుందని ఆయనే కాదు సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఇదే విషయాన్ని ప్రముఖ రచయితలు పరుచూరి బ్రద ర్స్ కూడా వెల్లడించారు. ఇక ఆయన గత చిత్రం రుద్రమదేవి కూడా భారీ హంగులతో రూపొందించారు. మంచి టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమా ..మంచి సక్సస్ ను సాధించింది. ఇక ప్రస్తుతం గుణశేఖర్ రానా దగ్గుబాటితో హిరణ్య కశిప సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాని అధికారంగాను  ప్రకటించారు. భారీ కాన్వాయిస్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో గుణశేఖర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. సురేష్ బాబు తో కలిసి గుణశేఖర్ హిరణ్య కశిప సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

ప్రస్తుతం ఈ సినిమా కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవల నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ప్రకటించారు. అయితే ఈ సినిమాని వీలైనంత త్వరగా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సన్నాహాలు చేసినప్పటికి ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. అందుకు కారణం రానా త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. దాంతో కొన్నాళ్ళు పెళ్ళి పనులు ఆ తర్వాత కొత్త కాపురం ...కొత్త జీవితం ...మొదలు పెడుతుండటంతో సినిమాలకి కొంత బ్రేక్ ఇస్తాడని సమాచారం. మరి ఈ విషయంలో క్లారిటి మాత్రం ఇంకా రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: