రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న  సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ విదేశాలలో జరుపుకుంది. అయితే కరోనా వ్యాపించిన నేపథ్యంలో షూటింగ్ ని నిలిపివేసి ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత హైద్రాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రభాస్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని సిద్దం చేసినట్టు తెలుస్తుంది. 

 

లాక్ డౌన్ ఎత్తేయగానే పరిస్థితులను బట్టి లిమిటెడ్ టెక్నీషియన్స్ తో షూటింగ్ ని కంప్లీట్ చేస్తారట. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ వచ్చేలా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ముందు నుంచి అంటున్నారు. అంతేకాదు త్వరలో ఈ సినిమా నుండి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యో న్యూస్ ఒకటి రానుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

 

జాన్, రాధే శ్యాం అన్న టైటిల్స్ ప్రస్తుతం ప్రచారం లో ఉన్నాయి. అయితే త్వరలో వచ్చే ఆ సర్‌ప్రైజ్ టైటిల్ తో పాటు ప్రభాస్ లుక్ కి సంబంధించిందేనని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ .. నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమాలో నటిస్తాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50 వ సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా కి సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేయనున్నారట. పాన్ ఇండియా కేటగిరీలో రూపొందబోయో ఈ సినిమా 2021 లో ప్రారంభం కానుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: