ఇప్పటి వరకు చేసిన సినిమాలతో నివేదా థామస్ అద్భుతమైన నటి అని నిరూపించుకుంది. తను ఎంచుకునే కథల్లో నటనకి ఆస్కారం ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి సినీ ప్రముఖుల నుంచి తన నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పటి వరకు నివేదా థామస్ గ్లామర్ పాత్రల్ని, ఎక్స్‌ఫోజింగ్ కి సై అనకపోవడం ఆసక్తికరం. ఇక ప్రస్తుతం నివేదా థామస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ లో నటిస్తుంది.

 

ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శృతిహాసన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తోందని సమాచారం. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు అంజలి, అనన్య నాగల్ల, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ లోను ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు రెండు భాషల్లోను 100 కోట్లు పై నే వసూళ్ళను సాధించింది.

 

వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఒక సాంగ్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలన్ని కలిపి ఒక నెల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దర్శకుడు ఇటీవల తెలిపాడు. లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూలై నుండి ప్రమోషన్స్ ని మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. 

 

అయితే ఇప్పుడు అందరూ ఈ సినిమా కి సంబంధించిన ఒక విషయం లో ఆసక్తికరమైన చర్చ జరుపుతున్నారట. అదే ఇందులో పవన్ కళ్యాణ్ తర్వాత నివేదా థామస్ పోషిస్తున్న పాత్ర గురించి. ఈ పాత్రని హిందీలో తాప్సీ పోషించింది. బాలీవుడ్ పింక్ సినిమాలో అమితాబ్ తర్వాత అంతటొ గొప్ప పేరు తెచ్చింది ఒక్క తాప్సీ పాత్రకే. ఈ సినిమాలో తాప్సీ నటనకి బాలీవుడ్ మొత్తం శభాష్ అంది. ఇప్పుడు అదే పాత్ర ఇక్కడ నివేదా థామస్ పోషిస్తుండటంతో ఖచ్చితంగా తన నటనకి అవార్డ్ దక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మరి ఇంత శక్తి వంతమైన పాత్రని నివేదా ఎలా చేసిందో వకీల్ సాబ్ రిలీజయ్యాక తెలుస్తుంది.   
    

మరింత సమాచారం తెలుసుకోండి: