బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ కి ఇటు దక్షిణాదిలోనూ, ఉత్తరాదిలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. సాహో సినిమా ఉత్తరాది ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ ఒక రీజన్ చాలు ప్రభాస్ స్టామినా అక్కడ ఎలా ఉందో తెలియడానికి. ప్రస్తుతం ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా టైటిల్ ని ఇంతవరకూ రివీల్ చేయలేదు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది. లాక్డౌన్ టైమ్ లో ఒక్కో సినిమా నుండి అప్డేట్లు వస్తూ ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరో అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ అని కూర్చోవాల్సి వచ్చింది. కనీసం టైటిల్ అయినా ప్రకటించాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

 

 

ఒకదశలో నిర్మాతగా వ్యవహరిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ ని బ్యాన్ చేయాలంటూ ట్రెండ్ చేసారు. దాంతో యూవీ క్రియేషన్స్ లాక్డౌన్ పూర్తయ్యాక ప్రభాస్ సినిమాపై అప్డేట్ ఉంటుందని తెలిపింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగులకి అనుమతి లభించవచ్చని వార్తలు వస్తున్నాయి. పరిమిత సంఖ్యలో , అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ జరుపుకోవచ్చని అంటున్నారు. దాంతో ప్రభాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

 

ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల కోరిక నెరవేరనుంది. ఈ నెలలో ప్రభాస్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అన్నమాట. మరి ఈ సారైనా నిర్మాతలు వారి మాటలు నిలబెట్టుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: