టాలీవుడ్ లో చాలా సినిమాలు ప్రేక్షకులకు గుర్తు ఉంటాయి. అందులో ఈ తరానికి అయితే పూరి జగన్నాథ్ సినిమాలు చాలా బాగా గుర్తు ఉంటాయి. ముఖ్యంగా పూరి తీసుకునే కథలు సినిమాను తీసుకొచ్చే విధానం తో పాటుగా దర్శకుడు హీరో పాత్రకు ఇచ్చే ప్రాధాన్యత హీరో ని తీర్చి దిద్దే విధానం అన్ని కూడా చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక మహేష్ హీరో గా పూరి జగన్నాథ్ సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా చాలా బాగా విజయం సాధించాయి. 

 

ఒకటి పోకిరి అయితే రెండు బిజినెస్ మెన్. ఈ సినిమాలు మహేష్ రేంజ్ ని పెంచడమే కాదు మహేష్ లో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి ఒక రేంజ్ లో పరిచయం చేసాయి కూడా. ఇక బిజినెస్ మెన్ చిత్రం మాత్రం ప్రేక్షకులకు నచ్చినా వివాదాలు ఎక్కువగా తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా ముంబై ని చూపించడం... ముంబై ని ఉచ్చ పోయించడానికి వచ్చా అని మహేష్ డైలాగులు చెప్పడం తో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలే ఉత్తరాది వాళ్లకు దక్షిణాది అంటే మంట అలాంటిది ఈ సినిమా తీసి వాళ్ళను ఇంకా కెలికారు అని చాలా మంది అన్నారు. 

 

సినిమా బాగున్నా సరే కొన్ని కొన్ని సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుంటుంది అని చాలా మంది అప్పట్లో సూచించారు. అయితే సినిమాకు సెన్సార్ బోర్డ్ ఓకే చెప్పింది. దీనిని ఆపమని ఒక బాలీవుడ్ దర్శకుడు కూడా హైదరాబాద్ వచ్చి మరీ ప్రయత్నాలు చేసాడు అని అంటారు. నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: