నిజానికి లాక్ డౌన్ సమయంలో సినిమా స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో వారి అభిమానులుతో లైవ్ వీడియోల ద్వారా సంభాషణ చేస్తూ వారి సంఘటనలు ఎప్పటికప్పుడు పంచుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇకపోతే కేరళ అ ఓవర్ నైట్ స్టార్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసి అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. ఇక పోతే ఈ భామ మళ్ళీ తిరిగి ఇంస్టాగ్రామ్ లో తాజాగా మరోసారి ప్రత్యక్షమైంది. అయితే ఎందుకిలా చేసింది అనే దానికి కారణాలు వివరించంది.

 


ఇకపోతే లాక్ డౌన్ కారణంగా తనలో ఒత్తిడి పెరిగిందని సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు, విమర్శలు, వారి కామెంట్స్ ఎవరు ఎందుకు ఫాలో అవుతున్నారో ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో నాకు ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు, మనశ్శాంతిని వెతుక్కునేందుకు ఇన్స్టాగ్రామ్ నుంచి వైదొలిగినట్లు ఆమె వెల్లడించారు. ఇకపోతే ఈ విషయంపై నా వ్యక్తిగత కారణాలతో ఇన్స్టాగ్రామ్ నుంచి నిష్క్రమించాలని తెలిపింది. ఇకపోతే ఈ విషయంపై పెద్దగా ఎవరూ పట్టించుకోరు అనుకున్నా కానీ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్, వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానని తెలిపింది. ముఖ్యంగా నా పై వచ్చిన ట్రోల్స్, మిమిస్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి అని తెలిపింది. అసలు నిజానికి నా పెర్సనల్ లైఫ్ మీద ఇంకొకరికి ఎందుకు అంత ఆసక్తి అని అర్థం కావట్లేదని భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే పూర్తిగా సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని తెలియజేసింది. 

 


గత మూడు నెలలుగా లాక్ డౌన్ విధించడంతో నేను ఇంట్లోనే ఉండిపోయాను. నాకు భవిష్యత్తులో కెరియర్ ఎలా ఉండబోతోంది...? కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో ...? జీవితం ఎలా ముందుకు సాగుతుంది ..? అనే సందేహాలు నన్ను కుదురుగా ఉంచడం లేదని తెలిపింది. ఇకపోతే నా వయసు ఉన్న అమ్మాయిలు అందరికీ ఇలాంటి సందేహాలు ఉండడం సహజమే. కానీ ఒక కన్ను గిటుతో దేశమంతా నా గురించే మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వచ్చిన గుర్తింపు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది అని తెలిపింది. ఇక చివరకు నన్ను ఎవరు పోగొట్టుకున్న పరవాలేదు కానీ రెండు మంచి మాటలతో మమల్ని ప్రోత్సహిస్తే చాలు అంటుంది ఈ కేరళ కుట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: