టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరొందిన సమంత సౌత్ లో కూడా తన సత్తా చాటుతూ అక్కినేని వారి ఇంటికి కోడలు అయిపోయింది. గత దశాబ్దకాలం సమంత నటిస్తున్న సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో 'ఏం మాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత కెరియర్ లో అనేక డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. నాగ చైతన్య తో  పెళ్లి అయిన తర్వాత కూడా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క కుటుంబ జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ సాధిస్తోంది.

IHG

ప్రజెంట్ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటిలో ఉండే సమయాన్ని గడుపుతోంది. భర్త నాగ చైతన్యతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లాక్ డౌన్ సమయంలో చేస్తున్న అనేక విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ పోస్టుల పెడుతోంది. అంతేకాకుండా నటనలో మెళుకువలు నేర్చుకోవడం కోసం లాక్ డౌన్ టైం లో ట్యూషన్ ఆన్ లైన్ క్లాసులు కూడా వింటున్నట్లు ఇటీవల చెప్పుకొచ్చింది. కాగా తాజాగా సమంత తన వెజిటబుల్ గార్డన్ ను అభిమానులకు పరిచయం చేసింది.

IHG

అర్బన్ కిసాన్ వారితో కలిసి తన ఇంటి టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ను ఏర్పాటు చేసింది. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న సమంత ఆర్గానిక్ పద్ధతిలో వెజిటబుల్స్ పండించడం నేర్చుకున్నది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మరియు అభిమానులు అక్కినేని ఫ్యామిలీ లక్కీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ప్రస్తుత తరానికి  ఇన్స్పిరేషన్ అవ్వడం లో అక్కినేని వారి కోడలు సమంత తరవాతే ఎవ్వరైనా అంటూ తెగ పొగుడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: